![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/07/aap-cong.jpg.webp)
Delhi: కాంగ్రెస్, ఆప్ పొత్తుకు బ్రేక్.. ఢిల్లీలో అసలేం జరుగుతోంది?
ఢిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విడివిడిగా పోటీ చేయబోతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ఢిల్లీతో పాటు హర్యానా ఎన్నికల్లోనూ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో ఐక్యత లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
ALSO READ: ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’
లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్లు కలిసి పోటీ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కూడా ఒక్క స్థానాన్ని సొంతం చేసుకోలేదు. ఢిల్లీని మరోసారి బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. అయితే, ఈ రెండు పార్టీల పొత్తు గురించి ఆప్ నేత, మంత్రి గోపాల్ రాయ్ గత నెలలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ తరుపున ఆయన స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల కోసమే పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని గోపాల్ రాయ్ అన్నారు. జూన్ ఆరో తేదీన ముఖ్యమంత్రి నివాసంలో ఆప్ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఇరు పార్టీల పొత్తుపై కాంగ్రెస్ వైఖరిని వెల్లడించారు.