తెలుగు
te తెలుగు en English
జాతీయం

Delhi: ఎంపీల సస్పెన్షన్‌ పై ఇండియా కూటమి కీలక నిర్ణయం

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రతిపక్షాల ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియా కూటమి భేటీ ముగిసింది. పార్లమెంట్ నుంచి 141 మంది ఎంపీల సస్పెన్షన్ ఖండిస్తూ ఇండియా కూటమి తీర్మానం చేసింది. ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా డిసెంబర్ 22న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా 8-10 సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read: జూడాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చ… సమ్మెను విరమించిన వైద్యులు

ఇండియా కూటమిలోని 28 పార్టీలు ఐక్యంగా ఉన్నాయని ఖర్గే తెలిపారు. సీట్ల సర్దుబాటు రాష్ట్రస్థాయిలో కుదరకపోతే ఇండియా కూటమిలోని నేతలు సీట్ల అంశాన్ని నిర్ణయిస్తారని ఏకాభిప్రాయానికి వచ్చామని స్పష్టం చేశారు. ఈ భేటీ డిసెంబర్ 6నే జరగాల్సి ఉండగా.. కీలక నేతల గౌర్హాజరు కారణంగా డిసెంబర్ 17కు వాయిదా పడింది. డిసెంబర్ 17 నుంచి మళ్లీ నేటికి వాయిదా పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button