![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/eci-new-780x470.png)
Elections: ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం… అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు
2024 పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలోనే జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి పెంచినట్టు ఈసీఐ తెలిపింది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా 95 లక్షలు ఖర్చు చేయవచ్చని స్పష్టం చేసింది.
Also Read: రూ.500లకే గ్యాస్ సిలిండర్… నిబంధనలు ఇవే..!
అదేవిధంగా ఒక్కో నియోజకవర్గంలో తిరిగే వాహనాల సంఖ్యను 5 నుంచి 13 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు.. ఎస్సీ, ఎస్టీలకు 12,500 ఇతరులు 25 వేల చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లీషులో కూడా ఎన్నికల సంఘానికి సమర్పించాలని తెలిపింది.
Also Read: వైసీపీకి ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా
కొన్ని రోజుల ముందు ఈసీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రాజకీయ పార్టీలు.. చిన్న పిల్లలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదని ఆదేశించింది. పార్టీ అభ్యర్థికి సంబంధించిన పోస్టర్లు అంటించటం, కరపత్రాలు పంచటం, ఎన్నికల ర్యాలీల్లో నినాదాలు చేయించటం వంటి పనులకు చిన్న పిల్లలను వినియోగించరాదని పేర్కొంది. ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో చిన్న పిల్లలను భాగం చేస్తే సహించబోమని ఈసీ స్పష్టం చేసింది.