తెలుగు
te తెలుగు en English
జాతీయం

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రతిభా సింగ్?

హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ హైకమాండ్‌కు పంపించారు. అయితే రాజీనామా లేఖను మాత్రం గవర్నర్‌కు ఇంకా పంపలేదు. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి, బీజేపీ అభ్యర్థికి ఓటేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం పదవికి సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేశారు.

ALSO READ: మార్చి 4న తెలంగాణకు ప్రధాని.. పలు కార్యక్రమాలకు శంకుస్థాపన

ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై కొత్త సీఎంను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో కాంగ్రెస్ సీనియర్‌ మహిళా నేత ప్రతిభా సింగ్ పేరు వినిపిస్తోంది. ఈమె ఎవరో కాదు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ఆరుసార్లు సీఎంగా సేవలందించిన దివంగత నేత వీరభద్ర సింగ్ సతీమణి. ప్రతిభా సింగ్ 1998 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. హిమాచల్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2013లో లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ నేత జైరామ్ ఠాకూర్‌ను ఓడించారు. 2014 ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఓడిపోయారు. 2021 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. 2022, ఏప్రిల్ 26 నుంచి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button