MP CM: మధ్యప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారం.. హాజరైన మోదీ, షా
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవరా ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు పలువురు సీనియర్ బీజేపీ నేతలు హాజరయ్యారు
స్పీకర్గా నరేంద్ర సింగ్ తోమర్!
ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ తోమర్ కొత్త అసెంబ్లీ స్పీకర్గా మారనున్నారు. అదే విధంగా మూడు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్సింగ్ చౌహాన్ కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్కు బీజేపీ ఈసారి మధ్యప్రదేశ్ సీఎంగా అవకాశం కల్పించింది. మోహన్ యాదవ్ 2013లో తొలిసారి ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాలకు గాను 163 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.