![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/nitish-kumar-1-780x470.webp)
Nitish Kumar: సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు బీహార్ తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు అందజేశారు. కాగా, గత నాలుగు రోజుల నుంచి వస్తున్న ఊహాగానాలకు తెర పడింది. మరోవైపు బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్.. ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోనున్నారు. విపక్షాల ఇండియా కూటమికి ఆయన గుడ్బై చెప్పినట్లైంది.
ALSO READ: టీడీపీకి ఎదురుగాలేనా? సీట్ల కేటాయింపులో తికమక!
బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం
గవర్నర్ ఆమోదం తర్వాత బీజేపీతో కలిసి నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటలకు మరోసారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, ఇప్పటికే బీజేపీ నుంచి ఆయనకు మద్దతు లేఖ అందినట్లు కూడా చెబుతున్నారు. ఇప్పటివరకు 8సార్లు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నితీష్కుమార్.. 9వసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అయితే నేటివరకు ఒక్కసారి కూడా నితీష్కుమార్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.