![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/modi-2.jpg)
PM Modi: మధ్యప్రదేశ్ లో ప్రధాని మోడీ పర్యటన.. ఎన్డీఏకి 400 సీట్లు వస్తాయని వెల్లడి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రావడం ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. అందులో బీజేపీనే సింగల్గా 370 స్థానాలు సాధిస్తుందని అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తుడుచుకుపెట్టుకుపోతుందని ఎద్దేవా చేశారు. ఆదివారం ప్రధాని మోడీ మధ్యప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గిరిజనులు అంటే కాంగ్రెస్ పార్టీకి చిన్నచూపని అన్నారు. గిరిజనులను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంక్లా మాత్రమే వాడుకుంటోందని ఆరోపించారు.
Also read: Balka Suman: సీఎం రేవంత్ పై బాల్క సుమన్ కామెంట్స్.. నోటీసులిచ్చిన పోలీసులు
కాంగ్రెస్ గిరిజనులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా.. వారిని అవమానించిందని మండిపడ్డారు. దేశంలో ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని పిలుపునిచ్చారు. దేశ ప్రజల కోసం 24/7 కష్టపడతామని మాట ఇచ్చారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో బీజేపీ ప్రచార స్పీడ్ పెంచింది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకుపోతుంది. ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు విపక్షాలంతా కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. కూటమి నుంచి ఒక్కోపార్టీ బయటకు వస్తున్నాయి.