తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: మాది ‘స్కాం’గ్రెస్ అయితే…మీది కల్వకుంట్ల SCAMILY: రేవంత్ రెడ్డి

మంత్రి కేటీఆర్ కర్ణాటకను ఉద్దేశించి నిన్న టీ.కాంగ్రెస్ నేతలను అన్న వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దళితబంధులో 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నట్టు స్వయంగా కేసీఆరే ఒప్పుకున్నారని… లిక్కర్ స్కాంలో కవిత 300 కోట్లు వెనకేసుకుందని దేశమంతా చెప్పుకుంటున్నారని విమర్శించారు. భూములు, మద్యం అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడవడంలేదని కాగ్ కడిగేసిన విషయం చెప్పు అంటూ ఎద్దేవాచేశారు.

తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నారో, ఎన్ని ఎకరాలను రియల్ ఎస్టేల్ మాఫియాకు కట్టబెట్టారో, ఎంతమంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారో అన్నీ లెక్కలతో సహా తేలుస్తామని మండిపడ్డారు. కాంగ్రెస్ ను అడ్డుకోవడం మీ తండ్రికొడుకుల వల్ల కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను చూసి తండ్రికి చలిజ్వరం, కొడుక్కేమో మతి తప్పినట్టుగా ఉందని రేవంత్ ఎద్దేవా చేశారు.

అంతకు ముందు కర్ణాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. రాబోయో అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌కు నిధుల సమీకరణ కోసం బెంగళూరు బిల్డర్లపై అక్కడి ప్రభుత్వం పన్ను విధిస్తోందని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్…స్కాంగ్రెస్ లాగా మారిందని ఆరోపించారు. ప్రతి చదరపు అడుగుకు 500 రూపాయల చొప్పున రాజకీయ ఎన్నికల పన్ను విధించడం ప్రారంభించిందని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button