తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

ED: సంచలనంగా మారిన గొర్రెల స్కాం కేసు.. రంగంలోకి దిగిన ఈడీ

తెలంగాణలో గొర్రెల స్కాం కేసు సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసు దర్యాప్తునుకు ఈడీ సైతం రంగంలోకి దిగింది. ఈ స్కాంలో రూ. 700 కోట్ల అవినీతి జరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈడీ పి.ఏం.ఎల్.ఏ. (మనీ లాండరింగ్ యాక్ట్) కింద విచారణ చేపట్టింది. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు కీలక ఆధారాలను సైతం సేకరించింది. గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అందివ్వాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు ఈడీ లేఖ రాసింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పధకం లబ్దిదారుల వివారాలు ఇవ్వాలని కోరింది.

ALSO READ: వైసీపీ ఎమ్మెల్సీలతో వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం

మరోవైపు, ఈ స్కాంకు సంబంధించి మూడు రోజుల కస్టడీ విచారణలో మాజీ అధికారులు నోరు మెదపడంలేదు. కుంభ కోణానికి కారకులు ఎవరు? ఎవరెవరి పాత్ర ఉంది? రికార్డ్స్ లో తప్పుడు లెక్కలపై ఏసీబీ ప్రశ్నించింది. గొర్రెలు అమ్మిన రైతుల ఖాతాలకు కాకుండా.. ఇతర బినామీల ఖాతాలకు డబ్బు మళ్లింపుపై ప్రశ్నించారు. ఏసీబీ విచారణకు మాజీ ఎండీ రామ్ చందర్ నాయక్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ సహకరించడం లేదని పేర్కొన్నారు. మూడు రోజుల కస్టడీ విచారణ పూర్తి కావడంతో తిరిగి చంచల్ గూడ జైలుకు నిందితులను తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button