తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Minister Ponnam: కులవృత్తుల రక్షణ ప్రభుత్వ బాధ్యత.. మంత్రి పొన్నం వెల్లడి

రాష్ట్రంలో కుల వృత్తులను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సచివాలయంలో పొన్నం ప్రభాకర్ ను కుమ్మరుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నడికుడి జయంతరావు, కుమ్మర సంఘం రాష్ట్ర కమిటీ నేతలు కలిశారు. కులవృత్తుల్లో కుమ్మరుల వృత్తి అంతరించిపోతోందని.. వృత్తిని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కి విజ్ఞప్తి చేశారు. 5 ఎకరాల్లో వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేసి వృత్తిని కాపాడాలని కోరారు. యంత్రాల ద్వారా మట్టి పాత్రలు తయారు చేయడానికి ఉచిత విద్యుత్ అందించాలని తెలిపారు. మట్టి పాత్రలు అమ్ముకునేందుకు ప్రభుత్వ స్థలాల్లో, మార్కెట్ లలో షాపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also read: Congress: నల్గొండ గడ్డపై కాంగ్రెస్ హవా.. అవిశ్వాసంలో మున్సిపాలిటీ హస్తగతం

అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కుల వృత్తులను కాపాడడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. కుల వృత్తులను కాపాడడానికి తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని కుమ్మర సంఘం నేతలకు తెలిపారు. కాగా.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పూజలు చేశారు. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యేకు ప్రభుత్వం క్యాంపు కార్యాలయాన్ని కేటాయించింది. కుటుంబ సమేతంగా గోమాతకు పూజలు చేసిన అనంతరం కార్యాలయంలోని ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు ఏది అవసరమో దానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button