తెలుగు
te తెలుగు en English
తెలంగాణ
Trending

Singareni: శుభవార్త.. సింగరేణిలో కొలువుల జాతర

నిరుద్యోగులకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. కొత్తగూడెం సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌/నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 29వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు https://scclmines.com/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు కోరారు.

ALSO READ: సంచలనంగా మారిన గొర్రెల స్కాం కేసు.. రంగంలోకి దిగిన ఈడీ

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల రూ. వంద దరఖాస్తు ఫీజు చెల్లించాలని, ఇతర అభ్యర్థులు రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. మొత్తం 327 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందులో మేనేజ్‌మెంట్ ట్రైనీ, ఇ2 గ్రేడ్: 42 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ , ఇ2 గ్రేడ్: 07 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ, టీ అండ్‌ ‌ఎస్‌ గ్రేడ్-సి: 100 పోస్టులు అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ, టీ అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి: 09 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ, టీ అండ్‌ ఎస్‌ గ్రేడ్-సి: 24 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ-I: 47 పోస్టులు, ఎలక్ట్రీషియన్ ట్రైనీ, కేటగిరీ-I: 98 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగాల వారీగా సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button