Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నియమించిన సలహాదారుల నియామకాలు రద్దుచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా ఏడుగురు సలహాదారుల నియామకాలను సీఎస్ రద్దు చేశారు.
Also Read: ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన కామెంట్స్… ఇది దేనికి సంకేతం?
తొలగించినది వీరినే
ప్రభుత్వ సలహాదారులైన సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రాజీవ్ శర్మ, ఇరిగేషన్ అడ్వైజర్గా ఉన్న ఎస్కే జోషి, సాంస్కృతిక, దేవాదాయ సలహాదారుగా కేవీ రమణా చారి(ఇటీవల రాజీనామా చేశారు), అటవీ సంరక్షణ శాఖ ముఖ్య సలహాదారుగా శోభ, హోంశాఖ సలహాదారుగా అనురాగ్ శర్మ, ముస్లిం మైనారిటీ సంక్షేమ సలహాదారుగా ఏకే ఖాన్, ఫైనాన్స్ డిపార్టుమెంట్లో స్పెషల్ ఆఫీసర్ హోదాలో జీఆర్ రెడ్డి, శివశంకర్, ఆర్ అండ్ బీ శాఖలో సుధాకర్ తేజ, అగ్రికల్చర్ ముఖ్య సలహాదారు చెన్నమనేని రమేష్, ఇంధన సెక్టార్లో రాజేంద్ర ప్రసాద్ సింగ్, ఉద్యాన శాఖలో శ్రీనివాస్ రావు ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: తెలంగాణలో ప్రజా దర్బార్.. మరి ఏపీలో..?
వీరిలో వ్యవసాయ శాఖకు చీఫ్ ఎడ్వైజర్గా చెన్నమనేని రమేష్ పనిచేశారు. వేములవాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు.. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఆయన ప్లేస్లో మరొకరిని ఎన్నికల బరిలో నిలిపి.. చెన్నమనేని రమేష్కు వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఐదేళ్ల పదవీకాలం ఉంటుందని అనుకున్న కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన పదవికి శుభం కార్డు పడింది. మిగతావారి విషయానికి వస్తే.. సోమేష్కుమార్, రాజీవ్శర్మ ఇద్దరూ.. ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శులు. సీఎస్లుగా వారి పదవీకాలం పూర్తికాగానే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాదారుల పోస్టులిచ్చారు.