తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: ప్రజాపాలన దరఖాస్తు… ఎలా నింపాలో తెలియజేసే వీడియో ఇదిగోండి!

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు లబ్దిదారులను ఎంపిక చేసేందుకు.. సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా.. పది రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. అన్నింటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది.

Also Read: TS Politics: ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరనున్నారా?… ఎందుకు?

ప్రజాపాలన దరఖాస్తు అనంతరం రశీదు

దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్‌ను కూడా జతపర్చాల్సి ఉంటుంది. ఇలా నింపిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి అందించి.. వాళ్లు అడిగిన వివరాలు చెప్తే.. వాళ్లు చెక్ చేసి దరఖాస్తు దారు ఏఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా.. దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి.. సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు. అయితే, కొందరికి దరఖాస్తు ఫిల్ చేసే క్రమంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎలాంటి అనుమానాలు లేకుండా దరఖాస్తును ఎలా నింపాలో కింది వీడియోలో తెలుసుకుందాం.

Also Read: తెలంగాణలో ప్రజపాలన షురూ.. వెల్లువలా దరఖాస్తులు

అధికారులకు సీఎస్ ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రోగ్రామ్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులు, డివిజన్లతో కలిపి మొత్తం 16,395 చోట్ల ప్రజాపాలన ప్రోగ్రామ్ కొనసాగనుంది. ఇందుకోసం మొత్తం 3,714 టీమ్‌లు ఏర్పాటయ్యాయి. ప్రతీ వంద మంది ప్రజలకు ఒక కౌంటర్ చొప్పున తొలుత అనుకున్నట్లుగానే ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్లను ఆమె ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button