తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ… ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ

తెలంగాణ నూతన శాసన సభ తొలి సమావేశాలు శనివారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. దీని కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రొటెం స్పీకర్ నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో నేడు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ సమావేశాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Also Read: తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లే.. ఐటీ మినిస్టర్ ఎవరంటే?

ప్రొటెమ్‌ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఓవైసీ

తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమా న్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్‌ శాసన సభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీని ప్రొటెమ్‌ స్పీకర్‌గా నామినేట్‌ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రొటెమ్‌ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Also Read: విద్యుత్ శాఖలో 85 వేల కోట్లు అప్పు.. సమీక్షకు సీఎండీ గైర్హాజరు!

ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ స్పీకర్ అయ్యే అవకాశం

స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో మొదటి రోజు సమావేశాలు ముగుస్తాయి. మళ్లీ ఆదివారం స్పీకర్ ను సభ్యులందరూ ఎన్నుకుంటారు. సోమవారం జరిగే సమావేశాల్లో తెలంగాణ గవర్నర్ తమిళసై శాసన సభ, శాసన మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మంగళవారం మళ్లీ సభ మొదలై, గవర్నర్ తీర్మానానికి సభ్యులందరూ ధన్యవాదాలు తెలుపుతారు. అనంతరం శాసన సభ నిరవదికంగా వాయిదా పడే అవకాశం ఉంది.

Also Read: తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం.. మార్గదర్శకాలు ఇవే

కేసీఆర్, రాజాసింగ్‌ దూరం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదు. అలాగే ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసేది లేదని గోషామహల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ స్పష్టం చేశారు. అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాకే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు. 2018లోనూ రాజాసింగ్… ప్రొటెం స్పీకర్‌‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్‌ ఖాన్‌ వ్యవహరించినప్పుడు ఇలాగే ప్రకటించారు. ఆ తర్వాత అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వచ్చాకే ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నారు.

9 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button