TS Elections: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆ రెండు స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దీంతో దీంతో ఈ రెండు స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎన్నికల కమిషన్ గురువారం విడుదల చేసి నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. జనవరి 29న పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.
షెడ్యూల్ ఇదే..
నోటిఫికేషన్ జారీ : జనవరి 11, 2024,
నామినేషన్లు ప్రారంభం : జనవరి 11, 2024,
దాఖలుకు తుది గడువు : జనవరి 18, 2024,
స్క్రూటినీ ప్రాసెస్ : జనవరి 19, 2024,
ఉపసంహరణకు గడువు : జనవరి 22, 2024,
పోలింగ్ తేదీ : జనవరి 22, 2024.