తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Athammas Kitchen: అత్తమ్మాస్ కిచెన్… బిజినెస్‌లోకి మెగాస్టార్ ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అత్తమ్మాస్ కిచెన్ పేరిట మెగా అత్తాకోడళ్లు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఇంటి భోజనాన్ని జ్ఞప్తికి తెచ్చేలా ప్రత్యేకంగా రూపొందించిన ఉప్మా, పులిహోర, పొంగల్, రసం రెడీ టు కుక్ ప్యాకెట్లను ఆవిష్కరించారు. ఈ నాలుగు కలిపి కొనాలనుకునే వారికి 1100 రూపాయలు ఛార్జ్ విధిస్తున్నారు.

Also Read: గూస్ బంప్స్ తెప్పిస్తున్న సాంగ్‌… మొదటి 𝐀𝐈 జెనరేటడ్ లిరికల్ వీడియో ఇదే!

నేరుగా మా వంట గది నుంచే మీ ఇంటికి ఈ రెడీ టు కుక్ పదార్థాలు అందుతాయని… తరతరాల ఆహార అనుబంధాన్ని ఆస్వాదించండి అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. తన అత్తమ్మ పుట్టినరోజు నాడే ఈ కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. ముఖ్యంగా సొంత ఇంట్లో లేని వారు అంటే బ్యాచిలర్స్ లేదా సొంత ప్రాంతానికి దూరంగా ఉంటున్న వారు వీలైనంత త్వరగా సౌత్ ఇండియన్ డిషెస్ తయారు చేసుకునేందుకు ఈ వెంచర్ స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పారు.

Also Read: ఓటిటిలోకి సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కాగా, అతమ్మాస్ కిచెన్ ఉత్పత్తులకు, రెసిపీలకు ప్రచారం కల్పిస్తూ ప్రత్యేకంగా athammaskitchen.com వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. ఆన్ లైన్ లో తమ ఉత్పత్తులను కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు. అత్తాకోడళ్ల బంధాన్ని పునర్ నిర్వచిస్తూ కొణిదెల వారి సంప్రదాయాల స్ఫూర్తిగా సరికొత్త రెసిపీలను ప్రజలకు అందించనున్నారు.

2 Comments

  1. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button