![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/medaram-4.jpg)
Medaram Jathara: మేడారం జాతరలో నేడు చివరి ఘట్టం.. భారీగా తరలివచ్చిన భక్తులు
మేడారం మహాజాతరలో చివరి ఘట్టమైన తిరుగువారం పండుగను ఇవాల నిర్వహించారు. పూజా మందిరాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వాటికి పూజారులు తాళాలు వేశారు. సమ్మక్క, సారలమ్మ ఉత్సవాలు మండమెలిగే పండుగతో ప్రారంభమై.. తిరుగువారంతో ముగిశాయి. తిరిగి వచ్చే ఏడాది మాఘమాసంలో మినీ జాతర సందర్భంగా సామగ్రిని బయటకు తీసి పూజలు చేయనున్నారు.
Also read: Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన రైలు ఛార్జీలు
ఈ ఏడాది ఈ నెల 7న మండమెలిగే పండుగతో జాతరను ప్రారంభించారు. 21న వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దిరాజు, గోవిందరాజు గద్దెలపైకి వేంచేసి భక్తులకు దర్శనం ఇచ్చారు. 4 రోజుల అనంతరం ఫిబ్రవరి 24న శనివారం వన ప్రవేశం చేశారు. ఇవాళ తిరుగువారంతో ఉత్సవాలు పూర్తయ్యాయి. తిరుగువారం సందర్భంగా మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. ఇక జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు కోటీ 50 లక్షల మంది భక్తులు అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సులు నడిపించింది. రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడిపింది. అలాగే ప్రైవేట్ వాహనాలలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.