తెలుగు
te తెలుగు en English
క్రికెట్

India Vs Australia: భారత్, ఆసిస్ మహిళల వన్డే సిరీస్.. సిరీస్ కోల్పోయిన టీమిండియా

భారత్, ఆస్ట్రేలియా మహిళ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను కంగారు జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Also read: India Cricket Team: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి.. టీమిండియాకు వరుస షాకులు

బ్యాటింగ్‌‌‌‌లో రిచా ఘోష్‌‌‌‌ (117 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లతో 96), బౌలింగ్‌‌‌‌లో దీప్తి శర్మ (5/38) చెలరేగినా.. ఇండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ వన్డే సిరీస్‌‌‌‌ను కాపాడుకోలేకపోయింది. టాస్‌‌‌‌ గెలిచిన ఆసీస్‌‌‌‌ 50 ఓవర్లలో 258/8 స్కోరు చేసింది. ఫోబీ లిచ్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ (63), ఎలీసా పెర్రీ (50) హాఫ్‌‌‌‌ సెంచరీలతో ఆకట్టుకున్నారు. తర్వాత 259 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాంటింగ్ కు వచ్చిన ఇండియా 50 ఓవర్లలో 255/8 స్కోరుకే పరిమితమైంది. జెమీమా రొడ్రిగ్స్‌‌‌‌ (44) రాణించింది. సదర్లాండ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే వాంఖడేలోనే మంగళవారం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button