CWC 2023: నేటి మ్యాచ్ లో భారత్ దే గెలుపు.. ప్రముఖ జ్యోతిష్యుని కామెంట్స్
వన్డే వరల్ట్ కప్ సిరీస్ లో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మ. 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే నేటి మ్యాచ్ లో ఇండియా గెలవబోతోందంటూ ప్రముఖ జ్యోతిష్యుడు సుమిత్ బజాజ్ చెప్పారు.
ముంబై వేదికగా భారత్ సెమీఫైనల్ ఆడుతుందన్న తన అంచనా నిజమైందని, అహ్మదాబాద్లో రోహిత్ సేన ఫైనల్ ఆడుతుందని సుమిత్ బజాజ్ తెలిపారు.
“ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి, గిల్, రోహిత్ కీలక పాత్ర పోషిస్తారు. కెప్టెన్ జాతకం చాలా ముఖ్యమైనది. జట్టు ప్రదర్శనలో రోహిత్ తన పాత్ర పోషిస్తాడు. ఫైనల్లోనూ టీమ్ను గెలిపిస్తాడు. రోహిత్ వయసు 37 ఏళ్లు. ఖచ్చితంగా చెప్పాలంటే 36.5 ఏళ్లు. ఈ సమయం భారత జట్టును విజేతగా నిలపడానికి రోహిత్ శర్మకు చాలా అనుకూలంగా ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం పీక్లో ఉన్నాడు..” అని సుమిత్ బజాజ్ జ్యోష్యం చెప్పారు.
మరోవైపు నేటి మ్యాచ్ లో “న్యూజిలాండ్ జట్టులో మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే వంటి కొందరు ఆటగాళ్లను గమనించాలి. రాచిన్ రాణించకపోవచ్చు.. అతడు త్వరగానే వికెట్ కోల్పోతాడు..” అని బజాజ్ వెల్లడించారు.