IND VS ENG: కుప్పకూలిన టాప్ ఆర్డర్.. కష్టాల్లో భారత్
ఇంగ్లాండ్తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో 177 పరుగలకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన కాసేపటికే రోహిత్ శర్మ(2) అండర్సన్ బౌలింగ్లో క్యాచి ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ స్పిన్నర్ షోయెబ్ బాషిర్..తన స్పిన్తో కీలక వికెట్లను పడగొట్టాడు. శుభమన్ గిల్(38), పటిదార్(17), జడేజా(12) వికెట్లను వెంటవెంటనే పడగొట్టాడు. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్(73) కూడా బాషిర్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ALSO READ: జురెల్ అదిరిపోయే క్యాచ్.. వీడియో వైరల్!
సర్ఫరాజ్ ఔట్..
మూడో టెస్ట్లో అదరగొట్టిన సర్ఫరాజ్(14).. టామ్ హార్ట్లీ బౌలింగ్లో క్యాచి ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ధ్రువ్ జురెల్(30 నాటౌట్), కుల్దీప్ యాదవ్(17 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఎనిమిదో వికెట్కు 39 పరుగులు జోడించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ప్రస్తుతం 8 వికెట్లకు భారత్ 219 పరుగులు చేసింది.