తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND vs ENG: భారత్‌తో నాలుగు టెస్ట్.. సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

రాంచి వేదికగా శుక్రవారం భారత్‌తో మొదలైన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదట పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌ ఆరంభించగా.. రెండో ఓవర్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆకాశ్‌ దీప్‌కు బంతినిచ్చాడు. తన తొలి ఓవర్‌లోనే ఆకాశ్.. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. తన రెండో ఓవర్‌లో జాక్‌ క్రాలే క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. అంఫైర్ నోబాల్‌గా ప్రకటించడంతో నిరాశ ఎదురైంది.

ALSO READ: నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్.. టీమిండియా సిరీస్ పట్టేనా?

జాక్‌ క్రాలే మళ్లీ క్లీన్‌ బౌల్డ్‌..

ఆకాశ్‌ దీప్‌ వేసిన పదో ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. మొదట ఓపెనర్ బెన్ డ‌కెట్(11)ను అవుట్‌ చేసిన ఆకాశ్‌.. నాలుగో బంతికి ఓలీ పోప్‌(0)ను ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 57 పరుగలకు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్‌లో జాక్‌ క్రాలే (42)ను బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ త‌ర్వాత అశ్విన్.. 22వ ఓవర్‌లో జానీ బెయిర్‌స్టో (38)ను, జ‌డేజా.. బెన్‌ స్టోక్స్‌ (3)ను ఔట్‌ చేశాడు. దీంతో లంచ్‌ సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్లకు 112 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 138/5 ఉండగా.. జో రూట్ (33), బెన్ ఫోక్స్(9) క్రీజులో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button