తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND vs ENG: గెలుపు దిశ‌గా భార‌త్.. ఎన్ని పరుగులు చేయాలంటే?

రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో గెలుపు దిశ‌గా సాగుతున్న భార‌త జ‌ట్టు మూడు వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. 84 పరుగుల వద్ద ఓపెనర్ యశస్వి జైస్వాల్ (37) పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన గిల్ నిలకడగా ఆట ప్రారంభించాడు. కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ (55) హాఫ్ సెంచరీ తర్వాత టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో క్యాచి ఇచ్చి ఔట్ అయ్యాడు. మరో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 114 పరుగులకు భారత్ 3 వికెట్లు కోల్పోయింది.

ALSO READ: స్పిన్నర్లు మడతపెట్టేశారు.. 145 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్

74 పరుగులు చేస్తే విజయమే..

లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభ్ మన్ గిల్ (18) జడేజా (3) క్రీజులో ఉన్నారు. ఇక భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 74 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, అంతకుముందు రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 353 పరుగులు చేయగా.. భారత్ 307కు ఆలౌటైంది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్..145 పరుగులకే కుప్పకూలింది.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button