తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND VS ENG: స్పిన్నర్లు మడతపెట్టేశారు.. 145 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత్ స్పిన్నర్లు మడత పెట్టేశారు. దీంతో ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలింది. మొదట వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 5 వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్‌ యాదవ్‌ 4 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా ఓ వికెట్‌ తీశాడు. కాగా,  తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌‌తో కలిపి ఇంగ్లండ్‌ భారత్‌కు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ALSO READ: రాంచీ టెస్టులో రాణించిన అశ్విన్.. కుంబ్లే రికార్డ్ బ్రేక్

భారత్ 40 పరుగులు

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను చక్కబెడుతున్న బెన్ ఫోక్స్‌(17)ను అశ్విన్ రిట‌ర్న్ క్యాచ్‌తో ఔట్ చేశాడు. ఆ త‌ర్వాతి బంతికే జేమ్స్ అండ‌ర్స్‌న్(0) కీపర్ చేతికి చిక్కాడు. అంతకుముందు జాక్‌ క్రాలే (60) రాణించగా.. బెయిర్‌స్టో (30), ఫోక్స్‌ (17), డకెట్‌ (15) పర్వాలేదనిపించారు. ఇక రూట్‌ (11), పోప్‌ (0), స్టోక్స్‌ (4), హార్ట్లీ (7), రాబిన్సన్‌ (0) ఘోరంగా విఫలమయ్యారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన భారత్ 8 ఓవర్లలో 40 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్( 24), జైశ్వాల్(16) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక భారత్ విజయం సాధించాంటే 152 పరుగులు చేస్తే సరిపోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button