India Cricket Team: సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి.. టీమిండియాకు వరుస షాకులు
సౌతాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్ లో ఓడిపోయి బాధలో ఉన్న టీమిండియాకు వరుస షాకులు తగులుతున్నాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. రెండు ఓవర్లు ఆలస్యంగా వేసినందుకు ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2 పాయింట్లు తగ్గించింది. దీంతో తాజాగా ఐదు ర్యాంక్ కు పడిపోయిన భారత్ జట్టు మరో ర్యాంక్ కు దిగజారి.. ఆరోస్థానంలో కొనసాగుతోంది.
Also read: Australia Vs Pakistan: లిఫ్ట్ లో ఇరుక్కున్న అంపైర్.. ఆగిన మ్యాచ్
ఇదే సమయంలో సౌతాఫ్రికా నంబర్వన్లోకి దూసుకొచ్చింది. పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా వరుసగా రెండు నుంచి 5వ ర్యాంక్లో ఉన్నాయి. తర్వాతి స్థానంలో భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్, శ్రీలంక వరుసగా 6 నుంచి 9 స్థానాల్లో ఉన్నాయి.
కాగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ లో 131 పరుగులకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ 2024 జనవరి 3 నుంచి కేప్ టౌన్ లో జరగనుంది. దీంతో తదుపరి టెస్ట్ మ్యాచ్ లోనైనా టీమిండియా పోటీలో నిలిచి తన ర్యాంక్ ను మెరుగుపరుచుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.