![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/1st-innings.jpg)
India Vs England: ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్.. ఇండియా స్కోర్ ఎంతంటే?
రాజ్ కోట్ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసింది. రెండో రోజు లంచ్ తర్వాత 445 పరుగులకు ఆలౌటైంది. 7 వికెట్ల నష్టానికి 388 పరుగులతో లంచ్ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించగా.. అదనంగా మరో 52 పరుగులు జోడించి చివరి మూడు వికెట్లు కోల్పోయింది. అశ్విన్(37), తొలి టెస్ట్ ఆడుతున్న జురెల్ (46) రాణించారు. వీరిద్దరూ 8వ వికెట్ కు 77 పరుగులు జోడించి భారీ స్కోర్ అందించారు. స్వల్ప వ్యవధిలోనే ఈ జోడీ పెవిలియన్ కు చేరింది. రెహన్ అహ్మద్ వీరిద్దరిని ఔట్ చేశాడు.
Also read: India Vs England: భారత్ కు పెనాల్టీ.. బ్యాటింగ్ చేయకుండానే ఇంగ్లాండ్ కు 5 రన్స్
ఈ దశలో భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగిసేలా కనిపించినా పేస్ బౌలర్లు బుమ్రా (26), సిరాజ్(3) ఇంగ్లాండ్ బౌలర్లను విసిగించారు. ముఖ్యంగా బుమ్రా తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. ఈ పేస్ బౌలర్ హిట్టింగ్ కి డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ బాగా ఎంజాయ్ చేశాడు. చివరి వికెట్ కు సిరాజ్ తో 30 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ కు 4 వికెట్లు పడగొట్టాడు. హర్టీలి, రెహాన్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. రూట్, ఆండర్సన్ కు తలో వికెట్ లభించింది.
తొలి రోజు ఆటలో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ (131), జడేజా (112) సెంచరీలతో కదం తొక్కిన సంగతి తెలిసిందే. వీరికి తోడు కెరీర్ లో గురువారం తొలి టెస్ట్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్ (66 బాల్స్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 62) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. యంగ్ ప్లేయర్లు జైస్వాల్(10) గిల్(0), పటిదార్ (5) విఫలమయ్యారు.