తెలుగు
te తెలుగు en English
క్రికెట్

India Vs South Africa: ఫస్ట్ సిరాజ్.. సెకండ్ బుమ్రా.. సౌతాఫ్రికా విలవిల

భారత్, సౌతాఫ్రికా మధ్య కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుల్లో భారత్ పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ పేస్ మాయాజాలనికి 55 పరుగులకే కుప్పకూలిన సఫారీలు రెండో ఇన్నింగ్స్ లోనూ అదే దారిలో పయనిస్తున్నారు. 3 వికెట్ల నష్టానికి 62 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు.. ఇప్పుడు భారత పేసర్ బుమ్రా ధాటికి విలవిల్లాడుతోంది. బుధవారం రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. అదే ఫామ్ ను రెండో రోజు కొనసాగిస్తున్నాడు. వికెట్ కీపర్ వెర్రాయిన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ ను వెనక్కి పంపిన ఈ స్టార్ పేసర్ 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

Also read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కు గొప్ప అవకాశం.. మరో అవార్డుకు నామినేట్

ప్రస్తుతం దక్షిణాఫ్రికా 36 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 176 పరుగులకు పరిమితమైంది. మరోవైపు మర్కరం (103) సెంచరీతో రాణించాడు. దీంతో భారత్ విజయలక్ష్యం 78 పరుగులు.

తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులకు ఆలౌట్ కావడంతో 98 పరుగుల ఆధిక్యం లభించింది. టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో ఉన్న టీమిండియా.. చివరి సెషన్‌ మొదలైన తొలి 8 ఓవర్లలోనే మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. కేవలం 11 బంతుల్లో మ్యాచ్ తలకిందులైపోయింది. భారీ ఆధిక్యం ఖాయమన్న దశలో స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button