తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Mens Cricket: భారత్‌కు షాక్.. రెండో టెస్ట్‌కు రాహుల్‌, జడేజా దూరం

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు‍కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా రెండో టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించింది. అంతకుముందు హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో జడేజా, రాహుల్ గాయపడ్డారు. పరుగులు తీసే క్రమంలో జడేజా తొడ నరాలు పట్టేయగా..రాహుల్ కూడా కుడి తొడ కండరాల్లో నొప్పితొ బాధపడుతున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం జట్టు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు.

ALSO READ: ఉప్పల్ లో భారత్, ఇంగ్లాండ్ టెస్టు.. ఆదాయం ఎంతంటే?

సర్ఫరాజ్‌కు చోటు..

జడేజా, రాహుల్ స్థానాల్లో అజిత్ అగార్కర్ సారథ్యంలోని మెన్స్ సెలెక్షన్ కమిటీ సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేసింది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్, కొత్తగా జట్టులోకి వచ్చిన ముగ్గురిలో సర్ఫరాజ్‌, సుందర్‌ ఇటీవల ఇంగ్లండ్‌ లయన్స్‌ జట్టుతో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడిన భారత్‌-ఎ జట్టులో సభ్యులుగా ఉన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో సర్ఫరాజ్‌ 161 పరుగుల భారీ సెంచరీ సాధించాడు. సుందర్‌ రెండు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్‌ లయన్స్‌పై భారత్‌-ఎ జట్టు ఇన్నింగ్స్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button