తెలుగు
te తెలుగు en English
క్రికెట్

MS Dhoni: సీఎస్కే ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. ధోనీ రెడీ అవుతున్నాడు

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్​ ధోని ఐపీఎల్​ 2024 కోసం అప్పుడే ప్రాక్టీస్​ మొదలుపెట్టాడు. ఇటు టీమిండియాను, అటు ఐపీఎల్​ లో చెన్నై సూపర్​ కింగ్స్ జట్టును ధోనీ విజయతీరాలకు నడిపించిన విషయం తెలిసిందే. మోకాలి గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ కూల్ ప్రస్తుతం ఐపీఎల్​ కోసం సన్నద్ధమవుతున్నాడు. చెన్నై జట్టుకు ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ గా ధోని ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఐపీఎల్​ 2023 కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాడు.

Also read: U-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ సత్తా.. వరుసగా తొమ్మిదోసారి ఫైనల్ కు

తాజాగా రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​ గా మారింది. ఇదిలా ఉండగా.. 2023 సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ కి గుడ్ బై చెప్పనప్పటికీ.. 2024 ఐపీఎల్ ఆడతాడా లేదా అనుమానం ఫ్యాన్స్ లో నెలకొంది. దీనికి తోడు మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఐపీఎల్ ఆడటం కష్టమే అని భావించారు.

ఈ విషయంపై బెంగళూరులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ధోనీ 2024 ఐపీఎల్ ఆడతాడని హింట్ ఇచ్చేశాడు. తాజాగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించడంతో ధోనీ ఐపీఎల్ 2024 ఆడటం కన్ఫర్మ్ అయిపోయింది. 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును వదలని ధోని ఇప్పటివరకు 5 టైటిల్స్ అందించాడు. 2023 లో గుజరాత్ జయింట్స్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచిన సూపర్ కింగ్స్.. 2024 ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button