Suryakumar Yadav: టీమిండియాకు భారీ షాక్.. జట్టుకు దూరం కానున్న కీలక ప్లేయర్?
వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2024 సిరీస్ కు ముందు భారత్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. టీ20 నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చీలమండ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 లో సూర్య ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే సిరీస్ కు దూరమయ్యాడు. స్కానింగ్ లో సూర్య గాయం తీవ్రమైనదని తేలితే సర్జరీ చేయించుకోవాల్సిందే. అదే జరిగితే ఈ ముంబై బ్యాటర్ మళ్లీ ఎప్పుడు క్రికెట్ లోకి వస్తాడో చెప్పడం కష్టం.
Also read: IND vs AUS Womens Test: ముంబై టెస్టు మ్యాచ్.. అదరగొడుతున్న అమ్మాయిలు
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు సెంచరీతో భారత్ ను గెలిపించిన సంగతి తెలిసిందే. చివరిదైన మూడో టీ20లో సఫారీలపై టీమిండియా గెలిచి సిరీస్ ను 1-1 తో సమం చేసింది. ఈ మ్యాచ్ లో బంతిని ఆపే క్రమంలో సూర్య వెనక్కి ట్విస్ట్ అయ్యాడు. కాలు పట్టేయడంతో నడవలేకపోయాడు. దీంతో వైద్య సిబ్బంది మోసుకుంటూనే సూర్యను తీసుకెళ్లారు. నొప్పితో విలవిల్లాడిన సూర్య మళ్లీ మైదానంలో కనిపించలేదు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తాను బాగానే ఉన్నానని ఈ స్టార్ బ్యాటర్ తెలిపాడు.