![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/GettyImages-1899349309-780x470.webp)
Virat Kohli: క్రీడాభిమానులకు షాక్.. టెస్ట్ సిరీస్కు కోహ్లి దూరం!
క్రీడాభిమానులకు షాకింగ్ వార్త. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి రావడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో ఇంగ్లండ్తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్లకు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి దూరం కానున్నారు. ఈ నెల 15నుంచి రాజ్కోట్లో మొదలయ్యే మూడో టెస్టుతో పాటు రాంచీలో జరిగే నాలుగో టెస్టుకు జట్టులోకి వచ్చే అవకాశాలు లేనట్లే. ఈ మేరకు మూడు, నాలుగో టెస్టుకు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడని బీసీసీఐ లోని పలువురు పేర్కొంటున్నారని సమాచారం.
ఐదో టెస్టుపై స్పష్టత లేదు!
ఐదో టెస్టు కోహ్లి ఆడటంపై స్పష్టత లేదు. దీంతో ధర్మశాలలో మార్చి 7నుంచి మొదలు కానుంది. కాగా, కోహ్లి, అనుష్క రెండో సంతానం కోసం ఎదురుచూస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏదీ ఏమైనా విరాట్ కోహ్లి సిరీస్కు దూరం కావడం భారత్కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కోహ్లితో పాటు గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 3వ టెస్టుకు పునరాగమనం చేయనున్నారు.