తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Virat Kohli: మ్యాచ్‌లకు విరాట్ దూరం.. క్లారిటీ ఇచ్చిన కోహ్లి సోదరుడు

స్వదేశంలో ఇంగ్లండ్‌తో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా భారత స్టార్ రన్ మెషీన్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది కోహ్లి తల్లి సరోజ్‌ అనారోగ్యానికి గురి కావడంతో రెండు మ్యాచ్‌లకు దూరమైనట్లు కామెంట్ చేస్తుండగా.. మరికొంతమంది ప్రస్తుతం కోహ్లి భార్య అనుష్క గర్భిణి కావడంతో దగ్గరుండి చూసుకునేందుకు సెలవు పెట్టినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. తాజాగా, ఈ విషయంపై కోహ్లి సోదరుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ALSO READ: అండర్- 19 వరల్డ్ కప్.. కివీస్ ను చిత్తుచేసిన భారత్

ఫేక్ వార్తలు ప్రచారం చేయొద్దు..

ఈ విషయంపై విరాట్‌ కోహ్లి సోదరుడు వికాస్‌ కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. విరాట్ తల్లి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వికాస్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఇలాంటి ఫేక్ విషయాలను ప్రచారం చేయొద్దని అభిమానులను కోరాడు. కాగా, రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్టు మ్యాచ్‌లో కోహ్లి ఆడనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button