తెలుగు
te తెలుగు en English
క్రికెట్

WTC Points Table: మళ్లీ రెండో స్థానానికి ఎగబాకిన భారత్

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 పాయింట్ల పట్టికలో భారత్ మళ్లీ రెండో స్థానానికి ఎగబాకింది. గత వారం న్యూజిలాండ్‌.. స్వదేశంలో దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు టెస్టులు గెలిచి అగ్రస్థానం దక్కించుకోగా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న ఆసీస్‌ రెండో స్థానానికి పడిపోగా.. భారత్‌ మూడో స్థానానికి పరిమితమైంది. అయితే తాజాగా, రాజ్‌కోట్‌ టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను రోహిత్‌ సేన 434 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దీంతో ఆస్ట్రేలియాను వెనక్కినెట్టి రెండో స్థానానికి ఎగబాకింది.

ALSO READ: బంగ్లా స్టార్‌ బౌలర్‌ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు

అగ్రస్థానంలో న్యూజిలాండ్‌

పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ 75 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ 59.52 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆస్ట్రేలియా 55 శాతంతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. 21.88 శాతంతో ఇంగ్లండ్‌ 8వ స్థానంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button