తెలంగాణ
TS Congress: కాంగ్రెస్ ఆరోగ్యశ్రీ పథకం… ఇవి మీకు తెలుసా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది. తెలంగాణలో అధికారంలోకి వస్తే.. పేదల కష్టాలను తీర్చే ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. రెండు పథకాలను అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రారంభించింది. ఆరు గ్యారెంటీలలో చేయూత పథకం ఒకటి. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చును 10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఈ నెల 9వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్టు అధికారులు తెలిపారు.
Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు
ఆరోగ్యశ్రీ… తెలుసుకోవాల్సిన అంశాలు
- ఆరోగ్యశ్రీ క్రింద వైద్యానికి 10 లక్షలకు పెంచిన తెలంగాణ ప్రభుత్వం.
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఇది అమలు.
- 2004లో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
- ఇది వరకు ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ ఉంది.
- నేటి నుంచి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసుకునే అవకాశం
- రాష్ట్రంలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు.
- రాష్ట్రవ్యాప్తంగా 1,310 ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ సేవలు
- 293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్సీలలో అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు.
- ఆరోగ్య శ్రీ కింద అందుబాటులో ఉన్న 1,376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలు.
- 2014లో ఆరోగ్య శ్రీ ప్రారంభించిన దగ్గర నుంచీ 18 లక్షల మంది దీన్ని ఉపయోగించుకున్నారు.
- దాదాపు తెలంగాణలో ఉన్న తొంభై లక్షల మంది ఈ పథకానికి అర్హులు.