![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/TATA-IPL-Trophy.png)
IPL: ఐపీఎల్ కి కొత్త స్పాన్సర్… బీసీసీఐకి ఏడాదికి 500 కోట్ల ఆదాయం
2024-28 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన టైటిల్ హక్కులను టాటా గ్రూప్ కంపెనీ దక్కించుకుంది. మరో ఐదేండ్ల వరకు టాటా గ్రూపే టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ఈమేరకు టాటా గ్రూప్ సంవత్సరానికి 500 కోట్లు చొప్పున 5 ఏళ్లకు 2500 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది.
Also Read: సానియా మీర్జాకు ఊహించని షాక్.. మరో పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ క్రికెటర్
టాటా గ్రూప్ గతంలోనూ ఐపీఎల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. 2022, 2023 సీజన్లకు టాటా గ్రూపే ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్. అంతేకాదు, ప్రపంచ క్రికెట్ లో అతి పెద్ద మహిళల టీ20 లీగ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కు టైటిల్ స్పాన్సర్ కూడా ఈ దేశీయ దిగ్గజ సంస్థే.
Also Read: స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వేకు కరోనా.. మ్యాచ్కు దూరం
దీని కంటే ముందు టైటిల్ స్పాన్సర్గా వీవో కంపెనీ ఉండేది. చైనీస్ మెుబైల్ కంపెనీ అయిన వీవో 2017లో ఐపీఎల్ టైటిల్ హక్కులను సొంతం చేసుకుంది. 2018-22 వరకు జరిగే ఐదు సీజన్ల కోసం సంవత్సరానికి 440 కోట్ల చొప్పున మెుత్తం 2,199 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2020లో డ్రీమ్11 ఒక సీజన్కు స్పాన్సర్ గా వ్యవహారించింది. దీంతో వీవో కాంట్రాక్ట్ ను 2023 వరకు పొడిగించింది. అయితే కొన్ని షరతులతో టాటా మిగిలిన స్పాన్సర్షిప్ హక్కులను కైవసం చేసుకుంది.