![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/కేఏ-పాల్.jpg)
KA Paul: సీఎం రేవంత్ రెడ్డితో కేఏ పాల్ భేటీ… గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్కు ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో సీఎంను కలిసిన పాల్ తాను హైదరాబాద్లో నిర్వహించబోయే సదస్సు గురించి చర్చించారు. అక్టోబర్ 2న గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ను హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు కేఏ పాల్ తెలిపారు. ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు.
Also Read: తెలంగాణలో అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు: సీఎం రేవంత్
తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం ఇచ్చేందుకు అంగీకరించినట్లు చెప్పారు. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ ఇన్వెస్టర్లను కోరుతూ సీఎంతో కలిసి వీడియోను విడుదల చేశారు. కె.ఎ.పాల్ హైదరాబాద్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.