![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/Rahul-ganadi_.webp)
Delhi: ఎంఎస్పీ హామీ ద్వారా వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతాయి: రాహుల్ గాంధీ
రైతుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎండగట్టారు. ఎంఎస్పీ (కనీస మద్దతు ధర)పై గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్న వారు హరిత విప్లవ పితామహుడు, భారత రత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాధన్ను అవమానిస్తున్నారన్నారు. ఐదేండ్ల పాటు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: రేవంత్ హవా కొనసాగేనా? …. ఏపీలో కాంగ్రెస్ దూసుకెళ్లెనా?
కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు బుధవారం తిరిగి ఛలో ఢిల్లీ ప్రదర్శనను పునరుద్ధరించనున్నారు. ఎంఎస్పీ హామీ ద్వారా వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతాయని, గ్రామీణ భారతంలో డిమాండ్ పెరుగుతుందని, రైతులు సైతం విభిన్న పంటలను సాగు చేసేలా అన్నదాతల్లో భరోసా కలుగుతుందని రాహుల్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. 14 లక్షల కోట్ల బ్యాంకు రుణాల మాఫీ, 1.8 లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన దేశంలో రైతుల కోసం చిన్నపాటి ఖర్చుకు కూడా ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.