క్రికెట్
IPL: ఐపీఎల్-2024 షురూ.. ఎప్పటినుంచి అంటే?
క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ తెలియజేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సారి ఐపీఎల్లో ఆడనున్న అన్ని జట్లు మారిపోయాయి. డిసెంబర్లో జరిగిన వేలం పాట తర్వాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు పూర్తిగా మారడంతో చాలామంది ఆటగాళ్లు కొత్త ఫ్రాంఛైజీల తరఫున ఆడనున్నారు.
ALSO READ: వారెవ్వా…! భారత ఫుట్బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయికి చోటు
ఎన్నికల తర్వాతే..
మార్చి మూడో వారంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే నెలలో ఐపీఎల్ షెడ్యూల్ కావడం దాదాపుగా ఖాయమైంది. అయితే ఎన్నికల తర్వాతే ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో అటు ఎన్నికల సందడి, ఇటు ఐపీఎల్ 2024 మ్యాచ్ల నిర్వహణతో వచ్చే నెల రసవత్తరంగా ఉండనుంది.