తెలుగు
te తెలుగు en English
క్రీడలుఫుట్బాల్

Football: వారెవ్వా…! భారత ఫుట్‌బాల్‌ జట్టులో తెలంగాణ అమ్మాయికి చోటు

భారత మహిళలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నారు. అవకాశం దొరకాలే గానీ ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. మగవాళ్లతో పోల్చితే తాము ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారిణి సౌమ్య గుగులోత్ భారత ఫుట్‌బాల్ జట్టులో చోటు సంపాదించి అందరి చేత ‘వారేవ్వా’ అనిపించుకున్నారు. నాలుగు దేశాల మధ్య జరిగే టర్కిష్‌ కప్‌ అంతర్జాతీయ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నీ పాల్గొనే భారత సీనియర్‌ జట్టులో ఆమెకు చోటు లభించింది. మొత్తం 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో ఫార్వర్డ్‌ ప్లేయర్‌ సౌమ్య గుగులోత్‌కు స్థానం దక్కడం పట్ల తెలుగు రాష్ట్రాల క్రీడాభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ALSO READ: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌.. జట్టులోకి కీలక ఆటగాడు!

భారత్, హాంకాంగ్, ఎస్టోనియా, కొసోవో దేశాల మధ్య రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. ఇవాళ టర్కీలోని అలాన్యా పట్టణంలో ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 21న ఎస్టోనియాతో, 24న హాంకాంగ్‌తో, 27న కొసోవోతో భారత జట్టు తలపడనుంది. అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు టైటిల్‌ లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button