తెలుగు
te తెలుగు en English
ఫుట్బాల్

Lightning Kills Footballer: ఫుట్‌బాల్ ఆట‌గాడిపై పిడుగు.. మైదానంలోనే మృత్యువాత

ఇండోనేషియాలోని ఓ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్ జ‌రుగుతుండగా విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఎఫ్‌బీఐ స‌బంగ్, బాండుంగ్ ఫుట్‌బాల్ క్ల‌బ్ జ‌ట్ల మ‌ధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ జ‌రుగుతోంది. గోల్ కొట్టేందుకు ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు పోటాపోటీగా త‌ల‌ప‌డుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా మైదానంలో ఉన్న స‌బంగ్ ఆట‌గాడిపై పిడుగు ప‌డింది.

ALSO READ: ఆసీస్‌దే అండర్‌ -19 వరల్డ్‌ కప్‌.. ఫైనల్లో తడబడిన భారత్

శోకసంద్రంలో క్రీడాకారులు..

మైదానంలో ఉన్న ఆటగాళ్లు పిడుగు శబ్ధం విని అందరూ ప‌డుకుండిపోయారు. కాసేప‌టి తర్వాత అందరూ లేచి చూడగా.. అత‌డు మాత్రం చలనం లేకుండా అలాగే ప‌డిఉన్నాడు. వెంట‌నే సిబ్బంది అత‌డిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించగా.. అప్ప‌టికే ఆ ఫుట్‌బాల‌ర్ ప్రాణాలు విడిచిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. దీంతో క్రీడాకారులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button