తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Ranchi Test: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌.. జట్టులోకి కీలక ఆటగాడు!

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్ తొలి టెస్టులో ఓడినా… రెండు, మూడు టెస్టుల్లో గెలిచింది. దీంతో 2 – 1 ఆధిక్యంతో సిరీస్‌పై కన్ను వేసింది. ఈ క్రమంలో రాంచీలో ఈ నెల 23 నుంచి జరిగే నాలుగో టెస్టు మ్యాచ్‌ కోసం సన్నద్ధం అవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో కొంతమందికి విశ్రాంతి ఇవ్వడంతోపాటు గాయాలతో మ్యాచ్‌లకు దూరమైన కీలక ఆటగాళ్లను తీసుకొస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎవరు జట్టులోకి వస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: నాలుగో టెస్ట్‌కు బుమ్రా డౌటే… కారణం ఏంటి?

రజత్‌ పాటిదార్‌పై వేటు?

గాయం కారణంగా గత రెండు టెస్ట్‌ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ..ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్‌కు అందుబాటులోకి రానున్నాడు. మోకాళ్ల సమస్యతో బాధపడుతున్న రాహుల్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉండి పూర్తిగా కోలుకున్నాడని సమాచారం. ఈ విషయాన్ని భారత్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పరోక్షంగా ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఈ విషయాంపై అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఒకవేళ రాహుల్ రెండు మ్యాచ్‌ల్లో ఆడేందుకు అందుబాటులోకి వస్తే రజత్‌ పాటిదార్‌పై వేటు పడే అవకాశం ఉంది. పాటిదార్‌.. విశాఖ టెస్ట్‌లో (32, 9), రాజ్‌కోట్‌ టెస్ట్‌లో (5, 0) పరుగులతో నిరాశ పరిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button