టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ సంచలన ప్రకటన చేశారు. తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. క్రికెట్పై దృష్టి సారించేందుకు తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఓ పోస్ట్ను పెట్టారు. ఇన్ని రోజులు తన నియోజక వర్గ ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన బీజేపీకి, ప్రధాని మోదీ, అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.
ALSO READ: ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు: యువరాజ్ సింగ్
టీమిండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా గంభీర్.. రాజకీయాల్లోనూ రాణించారు. 2019లో బీజేపీలో చేరిన ఆయన తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం పార్టీలో చురుగ్గా ఉన్నారు. గంభీర్ నిర్ణయం పట్ల ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కాగా.. ఐపీఎల్లో కేకేఆర్ జట్టుకు గంభీర్ ఈసారి మార్గదర్శకుడిగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.