తెలుగు
te తెలుగు en English
సినిమా

OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మీర్జాపూర్ 3’.. జూలై 5 నుంచి స్ట్రీమింగ్

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో అదిరిపోయే ఆదరణ దక్కడం తెెలిసిన విషయమే. ఇదివరకే రిలీజైన మీర్జాపూర్, మీర్జాపూర్ 2 సూపర్ హిట్‌గా నిలిచాయి. క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ కథాంశంతో గుర్మీత్‌ సింగ్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లకు ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి సీజన్‌ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించారు. దానికి మంచి స్పందన లభించింది. దీంతో దానికి సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదలైంది. ఇదీ విశేష ఆదరణ అందుకుంది. తాజాగా ‘మీర్జాపూర్ 3’ సైతం స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయింది. జూలై 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది.

ALSO READ: ఇవాళ ‘హరోం హర’ ప్రీ రిలీజ్ వేడుక.. గెస్టులు ఎవరో తెలుసా!

కాగా.. మీర్జాపూర్ 3 కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దీని షూటింగ్‌ పూర్తయినట్లు ఏడాది క్రితమే నటీనటులు వెల్లడించారు. అప్పటి నుంచి స్ట్రీమింగ్‌ తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా దాన్ని ప్రకటించడంతో వారంతా సంబర పడుతున్నారు. దీని రెండో సీజన్‌ విడుదలై మూడేళ్లు గడిచినా అందులోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియా మీమ్స్‌లో సందడి చేస్తూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button