తెలుగు
te తెలుగు en English
సినిమా

Ayodhya: డార్లింగ్ ప్రభాస్ కు అయోధ్య నుంచి పిలుపు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు అరుదైన ఆహ్వానం లభించింది. ఆదిపురుష్ లో రాముడి పాత్రలో నటించిన ప్రభాస్ కు అయోధ్య రామాలయ ప్రతిష్టాపనోత్సవానికి పిలుపు వచ్చింది. ప్రభాస్ తో పాటు బాలీవుడ్ దిగ్గజాలు రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ దంపతులు, సన్నీ దేవోల్, కేజీఎఫ్ యశ్, అజయ్ దేవ్ గణ్ తదితర ప్రముఖులకు ఆలయ నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు. వీరితో పాటు అన్ని భాషల సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read దేశంలో సలార్ జోరు.. ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

ఆదిపురుష్ లో రాముడి పాత్రలో మెరిసిన ప్రభాస్ కు ఆహ్వానం దక్కడం విశేషం. ఆ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో చక్కగా ఒదిగిన విషయం తెలిసిందే. మరి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభాస్ హాజరవుతాడా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. కాగా, ఇటీవల సలార్ సినిమాతో ప్రభాస్ మరో బిగ్గెస్ట్ హిాట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదే ఆహ్వానం పొందిన రణ్ బీర్ కూడా ఇటీవల ‘యానిమల్’ సినిమాతో మరో విజయాన్నందుకున్నాడు.

22న రాముడికి ప్రాణప్రతిష్ట
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఈనెల 22న ఆలయంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందుతున్నాయి. దీంతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కూడా పిలుపు వస్తోంది.

Also Read: కొత్త రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button