తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Ambati Rambabu: నాగార్జునసాగర్ వద్ద సాగుతున్న వివాదం.. మంత్రి అంబటి కామెంట్స్

నాగార్జునసాగర్ డ్యాం వద్ద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. ఆంధ్ర భూభాగంలో తెలంగాణ పోలీసులు ఉంటున్నారు. మా నీరు మా రైతులకు విడుదల చేయాలంటే తెలంగాణ అనుమతి ఎందుకు?.. మా భూభాగంగలోకి మా పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. సాగు నీరు కోసం పదే పదే తెలంగాణ రాష్ట్రం అనుమతి తీసుకోవాలా? అంటూ మండిపడ్డారు. మా వాటాకు మించి ఒక్క నీటి చుక్క వాడుకోలేదు. ఇది చాలా సున్నీతమైన అంశం, గొడవలు అవసరం లేదు. సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అని దుష్ప్రచారం చేశారంటూ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read: Cm Ramesh: సీఎం రమేష్ ఇలా చేశాడా.. ఆంతర్యం ఏంటో?

గతంలో చంద్రబాబు సర్కార్ ఫెయిలైతే.. ఇప్పుడు జగన్ సర్కార్ సక్సెస్ అయిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సాగర్ కుడి కెనాల్ ను కూడా తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధం. మా వాటాను మేము వాడుకునే స్వేచ్ఛ మాకు కావాలి. ఏపీ హక్కుల్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అసమర్థత వల్ల తెలంగాణ పోలీసులు.. ఏపీ భూభాగంలోకి వచ్చారని తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన, ఓడించాల్సిన అవసరం మాకు లేదన్నారు. తెలంగాణ రాజకీయాలపై తమకు ఆసక్తి లేదని.. ఎవరు అధికారంలోకి వచ్చినా మాకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button