తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: కుప్పంలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ ఇవాళ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం రాజుపేట్, రామకుప్పం మండలం హెలిప్యాడ్‌ చేరుకోనున్నారు. అనంతరం హెచ్ఎన్ఎస్ఎస్ నీరు విడుదల సందర్భంగా పూజలు చేసి నీటిని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 11:25 గుండిశెట్టిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. ఉదయం 11:40 గంటలకు గుండిశెట్టి పల్లి వద్ద బహిరంగ సభకు హాజరుకానున్నారు.

ALSO READ: రేపు మరో రెండు గ్యారంటీల అమలుపై ప్రకటన: భట్టి

కుప్పం ప్రజల చిరకాల వాంఛ..

కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022 సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారు. హంద్రీ, నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తిచేశారు. ఈ మేరకు ఇవాళ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. దీంతో తాగు, సాగునీటి కోసం దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేరనుంది.

One Comment

  1. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button