![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-03-at-17.38.23_df33fc40.jpg)
AP Elections: నా సైన్యం, బలం మీరే.. ‘సిద్ధం’ సభలో జగన్
మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా? అంటూ దెందులూరు ‘సిద్ధం’ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారని, ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని పేర్కొన్నారు. కానీ, నిజం ఏంటంటే.. చంద్రబాబుకి సైన్యం పొత్తులు అయితే.. నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న దేవుడు.. ఈ ప్రజలు అని సీఎం జగన్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
ALSO READ: దళపతి పొలిటికల్ ఎంట్రీ.. పవన్కల్యాణ్, విజయ్కు తేడా అదే!
చంద్రబాబు ఏమైనా చేశారా?
చంద్రబాబు ‘ఏనాడైనా ఒక్క రూపాయి అయినా ప్రజల ఖాతాల్లో వేశారా’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు లంచాలకు మారుపేరు. కానీ, మీ బిడ్డ ప్రభుత్వంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు సచివాలయాలు ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా ఐదువందలకు పైగా సేవలందిస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ఇంటి వద్దకే పథకాలు అందుతున్నాయన్నారు. డీబీటీ ద్వారా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా సొమ్ము జమ చేస్తున్నామని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నాడు – నేడు కార్యక్రమంతో స్కూళ్ల రూపు రేఖలు మార్చేశామని జగన్ వివరించారు.
ALSO READ: వైసీపీ ఆరో జాబితా రిలీజ్..మార్చిన స్థానాలివే?
బాబు పాలనకు, జగన్ పాలనకు తేడా ఇదే
అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించామని సీఎం జగన్ అన్నారు. అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం అని పిలుపునిచ్చారు. నా మాటలను ప్రతీ ఇంటికి వెళ్లి పంచుకోవాలని సభకు వచ్చిన వైసీపీ కార్యకర్తలను కోరారు. చంద్రబాబు పాలనకు, జగన్ పాలనకు తేడాను గమనించాలని అన్నారు. పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేయలేదన్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీములు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానైన్నా తీసుకోండి.. గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించాలన్నారు.