AP Government: ఏపీ పాలన భేష్.. అంతర్ రాష్ట్ర మండలి ప్రశంసల వర్షం
ఏపీలో అమలవుతున్న పాలనా విధానాలు, సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని అంతర్ రాష్ట్ర మండలి సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ బాగుందని కితాబు ఇచ్చారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానం మరింత సమర్థంగా ఉందని, రైతు భరోసా కేంద్రాలతో ఏపీలో రైతులకు విస్తృత ప్రయోజనాలు అందుతున్నాయని కొనియాడారు.
ALSO READ: ఆరోగ్య రక్ష.. ప్రతీ పేదవాడికి ఖరీదైన వైద్యం
గుడ్ ప్రాక్టీసెస్పై నివేదిక..
సీఎం వైస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సర్వేతో భూ యజమానులకు కచ్చితమైన భూ హక్కు పత్రాలను అందజేయడం మంచి విధానమని (గుడ్ ప్రాక్టీస్) పేర్కొంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న గుడ్ ప్రాక్టీసెస్పై అంతర్ రాష్ట్ర మండలి ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది. ఇందులో సచివాలయాలతో పాలనా వికేంద్రీకరణతోపాటు సమగ్ర సర్వేతో భూ రికార్డుల శుద్ధీకరణ, ‘ఫ్యామిలీ డాక్టర్’తో ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి అన్నదాతలను అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తోందని కొనియాడారు.