AP: ఆసక్తికరంగా ఏపీ రాజకీయాలు.. సాయంత్రంలోపు కొత్త సీఎస్?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. సెలవుపై వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డిని సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది. దీంతో ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ నెలాఖరును ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు. అనారోగ్య కారణాలతో లీవ్ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రంలోపు కొత్త సీఎస్ని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: చంద్రబాబు ప్రమాణస్వీకారం తేదీ మార్పు.. ఏ రోజంటే?
ఇక, జవహర్రెడ్డి సెలవుపై వెళ్లిన నేపథ్యంలో సాయంత్రంలోపు కొత్త సీఎస్ను నియమించే అవకాశముంది. మరోవైపు ఇప్పటికీ రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది. అంతేకాదు, రాష్ట్రంలో టీచర్ల బదిలీలపై ఎన్నికల కోడ్కు ముందు ఇచ్చిన ఉత్తర్వులను సైతం నిలిపివేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని డీఈవోలను ఆదేశించారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.