తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: జనసేన పార్టీకి బీటలు.. పార్టీని వీడిన మరోనేత

టీడీపీ, జనసేన పార్టీల పొత్తుతో జనసేన పార్టీకి బీటలు ప్రారంభమయ్యాయి. జనసేన టికెట్ ఆశించిన ఆశావహులు పొత్తులో భాగంగా టికెట్ టీడీపీకి కేటాయించడంతో పలువురు పార్టీని వీడుతున్నారు. తాజాగా, కాపు సంఘం ముఖ్యనేత హరిరామజోగయ్య తనయుడు సూర్యప్రకాశ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జనసేన తరపున ఆయన సీటు ఆశించారు. అయితే ఇటీవల విడుదల చేసిన జనసేన తొలి లిస్టులో తనకు నిరాశ ఎదురైంది. అంతకుముందు పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి 2018లో జనసేనలో చేరిన సంగతి తెలిసిందే.

ALSO READ: చదువే గొప్ప ఆస్తి.. నిధులు విడుదల చేసిన జగన్

గెలుపు ఓటములపై ప్రభావం

సూర్యప్రకాశ్ రాజీనామాతో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయన పార్టీని వీడడంతో కాపు సామాజిక వర్గం దూరం కానుంది. దీంతో రానున్న ఎన్నికల్లో గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు సూర్యప్రకాశ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మరికాసేపట్లో వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్, సీఎం జగన్‌‌ను కలిసి పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

ALSO READ: తొలి అడుగులోనే అసమ్మతి.. టీడీపీ, జనసేన శ్రేణుల్లో నైరాశ్యం

వైసీపీకి కలిసొచ్చే అవకాశం

సూర్యప్రకాశ్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పడం రాజకీయంగా వైసీపీకి కలిసొచ్చే అవకాశంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కాపు సంఘం ముఖ్యనేత హరిరామజోగయ్య తనయుడు సూర్యప్రకాశ్ లాంటి నేతలు పార్టీలో చేరడంతో వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలగనుందని అంటున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు కాపు సామాజిక వర్గం సపోర్ట్ చేసింది. అయితే రానున్న ఎన్నికల్లో వీరంతా వైసీపీకి మద్దతు తెలిపే అవకాశం ఉందని రాజకీయాల్లో చర్చ మొదలైంది.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button