![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-19-at-17.56.44_120625f2.jpg)
AP Politics: జగన్ విజన్ గొప్పది.. చంద్రబాబు పనైపోయింది!
మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం జగన్ ఒక్కరేనని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన – మహిళ స్పందన’ రాష్ట్రస్థాయి మహిళా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. అయితే మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్ బలంగా నమ్మారన్నారు. ఆనాడు ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులను మార్చేందుకు ప్రధాని హోదాలో ఉండి కూడా చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారన్నారు.
ALSO READ: సీట్ల పంచాయితీ.. కత్తులు నూరుతున్న టీడీపీ, జనసేన!
సమాజానికి మహిళలే మూలం
మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీ, 33% రిజర్వేషన్లు కల్పించారున్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది నాడు వైఎస్ఆర్.. ఇప్పుడు జగన్ అంటూ గుర్తు చేశారు. జగన్ వయసులో చిన్నవాడే. కానీ ఆయన విజన్ చాలా గొప్పగా ఉంందన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో చేయని విధంగా అమ్మ ఒడి దగ్గర నుంచి ఇళ్ల స్థలాల వరకు అన్ని పథకాలు మహిళలకు అందించినట్లు గుర్తు చేశారు. మహిళల మీద ఉన్న గౌరవంతో జగన్.. మహిళలకు కోసం పథకాలు తీసుకొచ్చి.. మహిళలే ఈ సమాజానికి మూలం అని నిరూపించారన్నారు.
ALSO READ: ‘జగనన్న విద్యాకానుక’ కిట్లపై కీలక అప్డేట్
బాబు పాలనలో రూ. 6 లక్షల కోట్లు లూటీ
చంద్రబాబు ముసలోడైపోయాడు. అందుకే లోకేష్ను సీఎం చేయాలని చూస్తున్నాడు. అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు. సన్నాసి అయిన లోకేష్ కావాలా?.. మంచి వ్యక్తి అయిన జగన్ కావాలో ప్రజలే ఆలోచించాలని చెప్పారు. చంద్రబాబు బాధితుల్లో నేను, నా భర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉన్నామన్నారు. అదే విధంగా గత పాలనలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగిందని, మళ్లీ చంద్రబాబుకి అధికారం ఇస్తే ఏపీని దోచేస్తాడు అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. కావున రాబోయే 15 ఏళ్లు వైసీపీ అధికారంలో ఉంటే ఏపీ ప్రపంచంలోనే నంబర్ 1గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.